
ఏ సికింద్రాబాద్ స్టేషన్కో, ఇంకో ప్రముఖ స్టేషన్కో వెళ్లిన వారు అక్కడ ఉచిత WiFi సదుపాయం వినియోగించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి ఫెసిలిటీ తమ ఊళ్లోని స్టేషన్కీ ఉంటే బాగుణ్ణు అనుకుంటారు.
ఆ కోరిక త్వరలోనే తీరబోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 8,500 రైల్వే స్టేషన్లలో ఉచిత wifi సేవలు రాబోతున్నాయి. 700 కోట్ల బడ్జెట్తో రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేయబోతోంది. ఇటీవల జరిగిన ఓ రైల్వే ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందింది. గ్రామీణ ప్రజానీకానికి e-governance సేవలు అందించడానికీ, Digital Indiaని విస్తరించడానికి గ్రామీణ ప్రాంతాల రైల్వే స్టేషన్లలో నెలకొల్పే WiFi సేవలను ఉపయోగించబోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని స్టేషన్లలో WiFi సదుపాయం కలిగిన కియోస్కులు అమర్చబడతాయి. ఇవి digital banking, Aadhaar సేవలు, ప్రభుత్వ సర్టిఫికెట్లు జారీ చేయడం, పన్నులు, బిల్లులు చెల్లించడం వంటి వేర్వేరు సేవలను సాధారణ పౌరులకి అందించబోతున్నాయి. అంతే కాదు.. Amazon, Flipkart వంటి సైట్ల నుండి తమకు కావలసిన వస్తువుల్ని ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా ఇవి కల్పిస్తాయి.
[…] స్టేషన్లలో internet సదుపాయం రాబోతోందని నిన్న ఈ లింకులో చెప్పుకున్నాం కదా. ఈ నేపధ్యంలో తరచూ […]