• Skip to primary navigation
  • Skip to content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

Tech News

Airtel T20 ఆఫర్ మీద హైకోర్ట్ ఆగ్రహం!

by

airtel t20 offer

Reliance Jio మార్కెట్లకు ప్రవేశించినప్పటినుండి దానికి వ్యతిరేకంగా Airtel పలు సందర్భాల్లో వ్యవహరించడం, దానికి ప్రతిస్పందనగా అవకాశం దొరికినప్పుడల్లా Jio కూడా Airtel కదలికలను నిశితంగా గమనిస్తూ అవసరమైతే కోర్ట్ కేసు వేయడం చూస్తూనే ఉన్నాం.

ఆ క్రమంలో తాజాగా T20 live streaming గురించి Airtel ఇచ్చిన ప్రకటన వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. IPL క్రికెట్ మ్యాచుల కవరేజ్ live and free access అనే పదాన్ని ప్రస్తావిస్తూ Airtel సంస్థ ప్రకటన ఇస్తోంది. ఈ ప్రకటన వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా లేదని దాని అక్షరాలు పెద్దగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని గతంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశించినప్పటికీ Airtel తగిన మార్పులు చేయకపోవడం గమనించి Reliance Jio సంస్థ మళ్లీ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది.

విచారణలో భాగంగా న్యాయమూర్తి యోగేశ్ ఖన్నా Airtel T20 live streaming గురించి ఇస్తున్న ప్రింట్, వీడియో ప్రకటనలు స్వయంగా పరిశీలించిన మీదట Airtel ఏప్రిల్ 13న జారీచేయబడిన గత కోర్ట్ ఆర్డర్‌లో పేర్కొన్న విధంగా మార్పులు చేయలేదని తక్షణం Live and free access అనే అక్షరాలను పెద్దవిగా చూపించాలని మరోసారి ఆదేశించారు.

వాస్తవానికి ఈ ఆఫర్ ద్వారా Airtel వినియోగదారులు కేవలం ఉచితంగా Hotstar సబ్స్క్రిప్షన్ పొందగలుగుతారు మాత్రమే. T20 మ్యాచ్‌లు చూడాలంటే వారు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని బట్టి లభించే మొబైల్ డేటా ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి Airtel వినియోగదారులను Airtel తప్పుదారి పట్టిస్తోంది అన్నది Reliance Jio ఆరోపణ.

Filed Under: Tech News Tagged With: airtel

Reliance Jio నెంబర్‌ని ఇప్పుడు Apple Watch 3లోనూ వాడుకోవచ్చు..

by

reliance jio apple watch 3

నిన్న మొన్నటివరకు స్మార్ట్ వాచ్ అంటే ఎలాంటి సిం కార్డు లేకుండా కేవలం మన దగ్గర ఉండే ఫోన్కి కనెక్ట్ అయ్యి పనిచేస్తుందని మాత్రమే మనందరికీ తెలుసు.

ఈ నేపథ్యంలో తాజాగా Apple సంస్థ తయారు చేసిన Apple Watch 3లో సెల్యులర్ కనెక్షన్ ఆధారంగా పని చేసే వెసులుబాటు ప్రవేశపెట్టబడింది. ఇదే అదనుగా ఇప్పటివరకు పలురకాల సందర్భాల్లో ఒకదానితో మరొకటి పోటాపోటీగా వ్యవహరించిన Reliance Jio మరియు Airtel సంస్థలు ఈ తాజా స్మార్ట్ వాచ్ ని కూడా భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. Airtel online store లో లభిస్తున్న ఈ watch, Airtel 4G నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది.
మరోవైపు రిలయన్స్ జియో వినియోగదారులు కూడా మే 4 నుండి ఈ watch కోసం ప్రీ రిజిస్ట్రేషన్ తీసుకుని మే 11 నుండి షిప్పింగ్ మొదలుపెడతాయి.

Apple Watch 3ని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో సంస్థ Jio Everywhere Connect పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా జియో వినియోగదారులు తాము వాడుతున్న ఫోన్ నెంబరును అటు తమవద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ తో పాటు ఇటు యాపిల్ watchలో కూడా వాడుకోవచ్చు.

అలాగని ప్రతి చోటికి phone వెంట తీసుకు వెళ్లాల్సిన పనిలేదు. అసలు మన దగ్గర అందుబాటులో ఫోన్ ఉన్న లేకపోయినా మన రెగ్యులర్ ఫోన్ నెంబర్ ద్వారా నేరుగా Apple Watch నుండే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఇలా ఒకటే ఫోన్ నెంబరును రెండు వేర్వేరు డివైజ్లలో వాడుకున్నందుకు గాను ప్రత్యేకంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. అలాగే రెండు చోట్ల వాడుకుంటున్నందుకు గాను రెండుసార్లు recharge చేసుకోవాల్సిన పని లేదు.

Filed Under: Tech News Tagged With: reliance jio

ఇంకా ఇది వాడుతుంటే జాగ్రత్త..

by

internet explorer bug

మీ కంప్యూటర్లో ఇప్పటికీ Internet Explorer ప్రోగ్రామ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.

తాజాగా అతిపెద్ద సెక్యూరిటీ లోపం internet explorer ఆధారంగా పనిచేసే కంప్యూటర్లను ప్రమాదంలోకి నెట్టి వేస్తోంది. చైనాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్రోగ్రాం Double Kill అనే సెక్యూరిటీ లోపాన్ని గుర్తించింది.

ఇప్పటికే ఈ లోపాన్ని ఆధారంగా చేసుకొని అనేక హ్యాకింగ్ గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా అధికశాతం మంది వినియోగదారులను టార్గెట్ చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రమాదకరమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ల రూపంలో హ్యాకర్లు కంప్యూటర్ యూజర్లను టార్గెట్ చేసుకుని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సెక్యూరిటీ లోపాన్ని సరి చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని మైక్రోసాఫ్ట్ patch చేసేవరకు అందరూ వీలైనంత వరకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్రోగ్రాముకి దూరంగా ఉండడం, ఒకవేళ తప్పనిసరిగా వాడాల్సి వస్తే అందులో మైక్రోసాఫ్ట్ word డాక్యుమెంట్ల రూపంలో వచ్చిన mail అటాచ్ మెంట్ లను ఓపెన్ చేయకుండా ఉండటం శ్రేయస్కరం.
ప్రమాదకరమైన మైక్రోసాఫ్ట్ Word డాక్యుమెంటును ఓపెన్ చేసిన తర్వాత అది మాల్వేర్ payload తో కూడిన ఒక ప్రమాదకరమైన వెబ్సైట్ను ఓపెన్ చేస్తుంది.

దాంతో కంప్యూటర్లోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈ payload ద్వారా హ్యాకర్లు బ్యాక్ డోర్ Trojanలని కూడా కంప్యూటర్ కి infect చేస్తారు. ఎటు మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి బదులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పోగ్రాంని అందిస్తున్న నేపథ్యంలో దాన్ని గానీ, Google Chrome వంటి శక్తివంతమైన వెబ్ బ్రౌజర్ ని గానీ వాడడం మంచిది.

Filed Under: Tech News Tagged With: computer security

మరోసారి సత్తా చాటిన Xiaomi phoneలు

by

xiaomi india market share

Xiaomi.. ఈ కంపెనీ పేరు వింటే బడ్జెట్ ఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా వేచి చూస్తుంటారు. భారతీయ స్మార్ట్ఫోన్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన షామీ సంస్థ మరోమారు అద్భుతమైన పనితీరుతో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది.

వాస్తవంగా Android phoneల విషయంలో చాలా ఏళ్ల నుండి నిన్నమొన్నటివరకూ Samsung సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండేది. అయితే 2017 చివరి మూడు నెలల్లో మొదటిసారి Samsungని అధిగమించి మొదటి స్థానం లోకి ప్రవేశించిన షాపీ సంస్థ అదే వరవడిని 2018లో కూడా కొనసాగిస్తోంది.

తాజాగా CounterPorint Research అనే సంస్థ భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ కు సంబంధించి 2018 మొదటి త్రైమాసిక ఫలితాలను తాజాగా వెల్లడించింది. దాని ప్రకారం ఓ పక్క Xiaomi మరింత మార్కెట్లో స్థిరపడగా, నిన్నమొన్నటివరకు నానా హడావుడి చేసిన Vivo, Oppo, Lenovo సంస్థలు భారీగా తమ మార్కెట్ షేర్‌ని కోల్పోవలసి వచ్చింది. మొత్తం భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 31.1 శాతం వాటాతో మొదటి స్థానంలో Xiaomi ఉండగా, 26.2 శాతం వాటాతో రెండో స్థానంలో Samsung నిలిచింది.

ఇక కేవలం 5.8 శాతం వాటాతో మూడో స్థానంలో Vivo, 5.6 శాతం వాటాతో నాలుగో స్థానంలో Oppo, 3.4 శాతం వాటాతో అయిదో స్థానంలో Huawei Honor సంస్థలు నిలిచాయి. గతంలో కేవలం 1.4 శాతం మార్కెట్ షేర్ ను మాత్రమే కలిగి ఉన్న Huawei సంస్థ తాజాగా 3.4 షేర్‌ని సొంతం చేసుకోవటం ఆశ్చర్యానికి గురిచేసే అంశం.

ఇక ఫీచర్ ఫోన్ ల విషయానికి వస్తే 35.8 శాతం మార్కెట్ షేర్‌తో మొదటి స్థానంలో Reliance JioPhone, 9.8 శాతం వాటాతో రెండో స్థానంలో శాంసంగ్, 9.4 శాతం వాటాతో మూడో స్థానంలో ITel, 7.3 శాతం వాటాతో 4వ స్థానంలో Nokia, 5.6 శాతం వాటాతో అయిదవ స్థానంలో Lava నిలిచాయి.

గమనిక: Telegramలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/sridharcera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Filed Under: Tech News Tagged With: Xiaomi

తాజాగా మీకు తెలియకుండానే మీ Gmail ఐడి నుండి మెయిల్స్ వెళ్తున్నాయి..

by

gmail new spam

స్పామ్‌ని అడ్డుకోవడం కోసం Gmail ఎన్నో పటిష్టమైన స్పామ్ ఫిల్టర్లు వాడుతూ ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సార్లు జిమెయిల్ కన్నుగప్పి పలురకాల స్పామ్ క్యాంపెయిన్లు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి.

అలాంటిదే తాజాగా ఒకటి యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది Gmail వినియోగదారులకు వారికి తెలియకుండానే వారి కాంటాక్ట్స్ లో 10 మెయిల్ ఐడిలకు, వాళ్ళకు వాళ్ళు స్వయంగా పంపినట్లు స్పామ్ మెయిల్స్ పంపించబడుతున్నాయి. ఇతరులతో పాటు వారికి కూడా ఆ మెయిల్ పంపబడుతోంది.

దాంతో తమకు తెలియకుండా ఇలా తమ తరఫున మెయిల్స్ ఎలా వెళుతున్నాయో అర్థంకాక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. కొంతమంది ప్రత్యేకంగా Sent folderలోకి వెళితే ఇలా తమకు తెలియకుండా ఇతరులకు మెయిల్ వెళ్లిన విషయం కనిపిస్తోంది. ఆయా వ్యక్తుల జీమెయిల్ అకౌంట్లు కాంప్రమైజ్ అయ్యాయా అని అనుకోవడానికి కూడా లేదు. 2 Factor Authenticationని కలిగి ఉన్న అనేకమంది యూజర్లకు కూడా ఇది జరుగుతోంది.

From ఫీల్డ్‌లో via అనే దగ్గర telus.net అనే పదం ప్రత్యేకంగా కనిపిస్తోంది. కొంతమంది పాస్వర్డ్లు మార్చుకుని కూడా చూశారు. కానీ ఫలితం లేదు. Gmailలో ఉన్న ఏదైనా లోపాన్ని ఆధారంగా చేసుకొని స్పామర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అన్నది స్పష్టం కావలసి ఉంది. జీమెయిల్ ఈ స్పామ్‌ని విశ్లేషిస్తున్నట్లు, త్వరలో దీన్ని నిలువరించబోతున్నట్లు తెలుస్తోంది.

Filed Under: Tech News Tagged With: gmail

  • Page 1
  • Page 2
  • Page 3
  • …
  • Page 384
  • Next Page »

Primary Sidebar

Recent Posts

  • Whatsapp వాడాలంటే కనీసం ఎంత వయస్సు ఉండాలో తెలుసా?
  • Airtel T20 ఆఫర్ మీద హైకోర్ట్ ఆగ్రహం!
  • ఉద్యోగాలకోసం చూసే వారికి Google తీసుకువచ్చిన సూపర్ ఆప్షన్!
  • WhatsApp ఇంకాస్త చుక్కలు చూపించబోతోంది..
  • Reliance Jio నెంబర్‌ని ఇప్పుడు Apple Watch 3లోనూ వాడుకోవచ్చు..

Copyright © 2018 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in