• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

Tech News

ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!

by

1 crore iphone theft from Amazon

Amazonలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు.. iPhoneలపై ఆశపడ్డారు. గిడ్డంగి నుండి ఏకంగా రెండు నెలలపాటు రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్క phone చొప్పున దొంగిలించడం మొదలుపెట్టారు.

దాంతో వేగంగా రెండు నెలల్లో 78 ఫోన్లు మిస్ అయ్యాయి. వీటి ధర కోటి రూపాయల వరకు ఉంది. గుర్గావ్‌లో Amazonకి వేర్‌హౌస్ ఉంది. ఇక్కడి నుండి అనేక ఫోన్లు దేశవ్యాప్తంగా షిప్పింగ్ అవుతుంటాయి. కరోనా పాండమిక్ కారణంగా, ఈ గిడ్డంగిలో చాలాకాలంపాటు సెక్యూరిటీ తనిఖీలను సడలించారు. సరిగ్గా దీన్ని అదునుగా చేసుకొని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు రోజుకొక iPhone చొప్పున దొంగిలించటం మొదలుపెట్టారు.

చివరికి విషయాన్ని తెలుసుకున్న Amazon పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వివిధ కోణాల్లో కేసు విచారించి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారు దొంగలించిన 78 iPhoneల నుండి 50 లక్షల రూపాయల విలువ కలిగిన 38 ఫోన్లని పోలీసులు విజయవంతంగా రికవర్ చెయ్యగలిగారు. మిగిలిన 40 ఫోన్ల వ్యవహారం తేలాల్సి ఉంది. అన్సార్ ఉల్ హక్, నవాబ్ సింగ్ అనే ఈ ఇద్దరు ఉద్యోగులను గుర్గావ్‌లోని వారి ఇళ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వాస్తవంగా లాక్ డౌన్ తర్వాత గుర్గావ్‌లోని Amazon వేర్‌హౌస్ కార్యకలాపాలు పునరుద్ధరించినప్పుడు సామాజిక దూరం నియమాలను అనుసరిస్తూ, ఉద్యోగులు విధులు నిర్వహించిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా చేసే తనిఖీలను పూర్తిగా తొలగించారు. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని ఆ ఇద్దరు ఉద్యోగులు రిటైల్ బాక్స్‌ల నుండి iPhoneలను తొలగించి, వాటిని జేబులో పెట్టుకుని బయటకు తీసుకు వెళ్ళటం మొదలుపెట్టారు. రెండు నెలల తర్వాత ఇలా చేసిన తర్వాత స్క్రూటినీని తప్పించుకోవడం కోసం వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఆగస్టు 28 వ తేదీన Amazon ఈ సంస్థ ఈ విషయాన్ని గుర్తించి, ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం, విచారణ కొనసాగడం, మూడు రోజుల క్రితం వారిని అరెస్టు చేయడం జరిగింది.

Filed Under: Tech News Tagged With: 1 crore iphone theft from Amazon, amazon employees, amazon iphones

ఈ చైనా ఫోన్ తయారీ కంపెనీ తాను అమ్మిన phoneలలో వైరస్‌ని అప్డేట్ ద్వారా పంపించింది!

by

china phone company trojan horse in phones

ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతున్న చైనా phone తయారీ కంపెనీ Gionee అనైతిక కార్యకలాపాలకు పాల్పడింది. మంచి వ్యాప్తంగా డిసెంబర్ 2018 నుంచి అక్టోబర్ 2019 మధ్యకాలంలో అమ్మిన 20 మిలియన్ స్మార్ట్ఫోన్లలో malwareని నిక్షిప్తం చేసినట్లుగా నిరూపితమైంది. దీనికి సంబంధించి కోర్టు లో కేసు కూడా వేయబడింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, Gionee సంస్థ అమ్మిన భారీ మొత్తంలో ఫోన్లలో ఒక అప్లికేషన్ రూపంలో ట్రోజన్ హార్స్ నిక్షిప్తం చేయబడింది. అసాంఘిక మార్గాల్లో వినియోగదారుల ఫోన్ల నుండి ప్రయోజనం పొందటానికి ఆ సంస్థ ఈ పన్నాగం పన్నింది. Gionee phoneలలో లభిస్తున్న Story Lock Screen appకి ఒక అప్డేట్ రూపంలో, Dark horse platform అనే ప్లగ్‌ఇన్ ద్వారా ఈ ట్రోజన్ హార్స్ యూజర్ల ఫోన్లలోకి ప్రవేశపెట్టబడింది.

వినియోగదారులకు ఏమాత్రం తెలియకుండానే వారి ఫోన్ లోకి ఈ అప్డేట్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఆ సంస్థకు భారతీయ కరెన్సీ ప్రకారం 22 లక్షల 57 వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది.

అధిక శాతం తయారీ కంపెనీలు ఈ మధ్యకాలంలో తాము విడుదల చేసే ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తూ, అందులో వినియోగదారులకు తెలియకుండా వివిధ రకాల ఫ్రేమ్‌వర్క్‌లను ఇన్స్టాల్ చేయటం, డయాగ్నస్టిక్ ప్రోగ్రామ్స్ ద్వారా యూజర్లకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించి వాటిని మార్కెటింగ్ అవసరాలకోసం ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి.

వీటన్నిటిని సమర్థవంతంగా అడ్డుకోవాలంటే గనక కచ్చితంగా యూజర్ల ప్రైవసీని మరియు సెక్యూరిటీని కాపాడకపోతే భారీ మొత్తంలో జరిమానా విధించే విధంగా చట్టాలు పటిష్టం కావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ప్రయత్నాలు ముందు ముందు కూడా కొనసాగే ప్రమాదం ఉంది.

Filed Under: Tech News Tagged With: android security, china phone company trojan horse in phones, china phones, phone virus

Airtel కొత్తగా లోన్ క్రింద Smartphone ఇలా ఆఫర్ చేస్తోంది!

by

Airtel ICICI smartphone loan plan

Airtel సంస్థ ICICI బ్యాంకు తో కలిసి, ఇప్పటికిప్పుడు ఫోన్ కొనడానికి ఆర్థిక స్తోమత లేని వినియోగదారులకు లోన్ కింద ఫోన్ మంజూరు చేసే కొత్త ప్లాన్ తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా మొట్టమొదట వినియోగదారులు 2999 రూపాయలు డౌన్ పేమెంట్ కింద చెల్లించి లోన్ కోసం అప్లై చేయాలి. ఎయిర్టెల్ సంస్థ 6099 రూపాయలు లోన్ రూపంలో అందిస్తుంది. పది నెలల లోపల ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇలా లోన్ ఇవ్వబడిన మొత్తం మీద 19 శాతం వడ్డీ వసూలు చేయబడుతుంది. ఏదైనా నెలలో అలస్యంగా EMI చెల్లించినట్లైతే 25 రూపాయలు లేట్ ఫీజు వసూలు చేయబడుతుంది. దీంతోపాటు 85 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కింద వసూలు చేయబడుతుంది.

ఈ స్కీమ్ కింద Airtel సంస్థ Nokia C3 హ్యాండ్‌సెట్‌ని అందిస్తోంది. హ్యాండ్ సెట్ లాక్ చేయబడి అందించబడుతుంది. అందులో అంతర్గతంగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఎయిర్టెల్ నిర్ణయించిన ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రమే వాడడానికి అవకాశం లభిస్తుంది. లోన్ మొత్తం చెల్లించకుండా వినియోగదారులు ఇతర ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ స్కీములకు మారిపోవడానికి సాధ్యపడదు.

లోన్ తీసుకున్న మొత్తాన్ని పేమెంట్ చేసిన తర్వాత వినియోగదారులు తమకు నచ్చిన విధంగా సిమ్ కార్డు మార్చుకునే అవకాశాన్ని, ప్లాన్ మార్చుకునే అవకాశాన్ని Airtel కల్పిస్తుంది. మొత్తం పేమెంట్ పూర్తయిన తర్వాత సంబంధిత ఫోన్ అన్లాక్ అయ్యేవిధంగా సర్వర్ నుండి ఒక ప్రత్యేకమైన కోడ్ పంపించబడడం ద్వారా ఆ ఫోన్ పూర్తిస్థాయిలో పని చేస్తుంది.

Smartphone ఒకేసారి కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేని వినియోగదారులకు Airtel తీసుకు వచ్చిన ఈ కొత్త ప్లాన్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో అన్ని టెలికాం సంస్థలు ఇలాంటి వినూత్నమైన ఆఫర్ల ద్వారా ఒకవైపు తమ సబ్స్క్రైబర్ల బేస్ పెంచుకుని మార్కెట్ షేర్ పెంచుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

Filed Under: Tech News Tagged With: Airtel ICICI smartphone loan plan, airtel smartphone, airtel telecom, Nokia C3

Whatsapp వాడుతున్న వారికి శుభవార్త!

by

Whatsapp Web video audio calls new feature

Whatsapp వినియోగదారులకు శుభవార్త. సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న ఒక కీలక సదుపాయం అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

ఆఫీస్ పని వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ అధిక సమయం కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ మీద గడిపే వినియోగదారులు చీటికిమాటికి ఫోన్ చేతిలో తీసుకోవాల్సిన పని లేకుండా Whatsapp Web సదుపాయం వాడతారు అన్న విషయం తెలిసిందే. దీనికోసం Google Chrome, Firefox వంటి బ్రౌజర్లలో web.whatsapp.com సైట్‌‌ని ఓపెన్ చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పటివరకు కేవలం టెక్స్ట్ మెసేజ్ లు కంపోజ్ చేసుకోవటం, ఫోటోలు వీడియోలు వంటివాటిని షేర్ చేసుకోవడం మాత్రమే వాట్స్అప్ వెబ్ ద్వారా సాధ్యపడుతోంది.

మిత్రులు లేదా బంధువులకు వీడియో కాల్ చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇక మీదట వాట్స్అప్ వీడియో కాల్స్ కూడా Whatsapp Web ద్వారా చేసుకునే అవకాశాన్ని ఆ సంస్థ అతి త్వరలో తీసుకు రాబోతోంది. కేవలం వీడియో కాల్స్ మాత్రమే కాకుండా ఇక మీదట వాట్స్అప్ వెబ్ ద్వారా ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు.

Whatsapp Beta వెర్షన్ వాడుతున్న కొంతమంది వినియోగదారులకు ఇప్పటికే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురాబడింది. మరింత ఎక్కువ మందికి త్వరలో ఇది అందుబాటులోకి వస్తుంది. అయితే మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా వాట్సాప్ వీడియో ఆడియో కాల్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా అందులో వెబ్ కెమెరా, మైక్రోఫోన్ ఉండాల్సి ఉంటుంది.

Whatsapp Web ద్వారా ఏదైనా కాల్ లో ఉన్నప్పుడు, ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ అయి అందులో కెమెరాను ఆన్ ఆఫ్ చేయడం, మైక్రోఫోన్ మ్యూట్ చేయడం, కాల్ తిరస్కరించడం వంటి ఆప్షన్స్ లభిస్తాయి. తమ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా Whatsapp వాడే వినియోగదారులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు.

Filed Under: Tech News Tagged With: whatsapp audio calls, whatsapp new features, whatsapp video calls, whatsapp web, Whatsapp Web video audio calls new feature

Netflix రేపు, ఎల్లుండి అందరూ ఉచితంగా చూడొచ్చు!

by

netflix streaming fest india

మిగతా OTT సర్వీసులతో పోలిస్తే Netflixలో భారీ మొత్తంలో హై క్వాలిటీ కంటెంట్ లభిస్తుంది. అయితే దాని సబ్స్క్రిప్షన్ ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది దానికి సబ్స్క్రైబ్ చేయడానికి వెనకాడుతూ ఉంటారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటివరకు Netflixకి సబ్ స్క్రైబ్ చేయని వినియోగదారులకు డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో అందులో ఉండే సినిమాలు, వెబ్ సిరీస్ లు పూర్తి ఉచితంగా చూసే అవకాశాన్ని Netflix కల్పిస్తోంది. Stream Fest పేరుతో ఈ సదుపాయం లభిస్తుంది. దీంట్లో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకు అన్ని సినిమాలు, ఆ OTTలో లభించే అన్ని ఒరిజినల్స్, డాక్యుమెంటరీలు, ఇతర కంటెంట్ మొత్తం కూడా ఈ రెండు రోజులపాటు లభిస్తుంది.

వాస్తవానికి Netflixలో ప్రధానంగా నాలుగు సబ్స్క్రిప్షన్స్ లభిస్తున్నాయి. 199, 499, 699, ఏడు వందల 99 రూపాయల విలువ కలిగిన ఈ ప్లాన్స్ ద్వారా విభిన్న రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ కంటెంట్ మొత్తాన్ని ఈ రెండు రోజులపాటు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. దీనికోసం మీరు చేయవలసిందల్లా https://netflix.com/streamfest అనే వెబ్సైట్లోకి వెళ్లి గానీ, లేదా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుండి Netflix అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.

ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి, పేరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి, డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో అన్ని రకాల కంటెంట్ ఈ అప్లికేషన్ ద్వారా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు మొబైల్ లో స్మార్ట్ డౌన్లోడ్స్ పొందొచ్చు. Netflixని హిందీ భాషలో పొందొచ్చు, పేరెంటల్ కంట్రోల్ సదుపాయాలు యాక్సెస్ చేయొచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్, గేమింగ్ కన్సోల్, స్మార్ట్ టీవీ వంటి అన్ని రకాల డివైజ్ల నుండి కంటెంట్ యాక్సెస్ చేయవచ్చు.

అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.. ఈ రెండు రోజుల పాటు ఉచితంగా లభించే కంటెంట్ HDలో కాకుండా కేవలం స్టాండర్డ్ డెఫినిషన్ లో మాత్రమే లభిస్తుంది. ఇప్పటికీ Netflix రుచి చూడని వారికి ఇది మంచి అవకాశం.

Filed Under: Tech News Tagged With: netflix, netflix india, netflix streaming fest india, ott free streaming

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 704
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in