మనందరి ఫేవరెట్ మెసెంజర్ యాప్ Whatsappని ఇండియాకి చెందిన Relince కంపెనీ కొనుగోలు చేసిందా? Whatsappలో తాజాాగా చలామణి అవుతున్న ఓ న్యూస్ అవుననే నిర్థారిస్తోంది. అయితే ఇది ఒట్టి పుకారు. ఇంకా కామెడీ ఏంటంటే ఇది ఈరోజు కొత్తగా పుట్టుకు వచ్చిన పుకారు ఏమాాత్రం కాదు. సంవత్సరం నుండి చలామణి అవుతున్నదే. అయితే తాజాగా Reliance Jio విపరీతంగా ప్రజాదరణ పొందడంతో ఈ పుకారుని చాలామంది గుడ్డిగా నమ్ముతున్నారు.
Whatsppని Reliance కొనుగోలు చేయడం అన్నది కేవలం పుకారు మాత్రమే కాదు.. దీని వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నకిలీ మెసేజ్లో Varun Pulyani అనే వ్యక్తిని Whatspp డైరెక్టర్గా పేర్కొన్నారు. సో వరుణ్ Whatsappని రిలయెన్స్కి చెందిన ముఖేష్ అంబానీకి 19 బిలియన్ డాలర్లకి అమ్మాడన్నది ఈ fake news సారాంశం.
ఈ మెసేజ్ చదివిన ప్రతీ ఒక్కరూ ఓ 10 మంది తమ మిత్రులకూ, తాము భాగస్వాములుగా ఉన్న గ్రూప్లకూ షేర్ చెయ్యాలని, అలా చేస్తే మాత్రమే యాజమాన్యం మారిన తర్వాత కొత్త Whatsappలో వారు ఉచితంగా, నిరాటంకంగా సర్వీస్ వాడుకోగలుగుతారనీ, లేదంటే Whatsapp సర్వీస్కి అంతరాయం ఏర్పడుతుందనీ ఈ మెసేజ్ భయపెడుతోంది.